స్వాతీ నక్షత్రం..
పాపి కొండల వద్ద పావన గోదావరి నదిలో స్వామి వారి అర్చారూపం ఉద్భవించింది. స్వస్తి శ్రీ ఆనంద నామ సంవత్సరం.. వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రయుక్త అభిజిత్ లగ్నము నందు భద్రాచలము లో శ్రీ రామాలయము నకు ఎదురుగా చిన్న గుట్ట పై శ్రీ యోగానంద జ్వాల లక్ష్మి నరసింహ స్వామి వారిని ప్రతిష్టించిరి . అది స్వామి వారి తిరు అవతార జన్మ తిది .(వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం).
అప్పటి నుండి స్వామి వారికీ స్వాతీ నక్షత్రం రోజున ప్రేత్యేక పూజాకార్యక్రమాలు జరుగుతున్నయి . స్వామివారు యోగీశ్వరుడు, కమనీయ విగ్రహుడు, ప్రసన్న ద్రుష్టి కలవాడు. ఆయనతో లక్ష్మి దేవిని కలిపి ఆరాధించాలి, కనుక లక్ష్మి దేవిని ముద్రించిన నిత్యను పాయినీ పతకాన్ని స్వామి వారి మెడ లో అలంకరించారు.
ఉంజల్ సేవ..
ప్రతి మాసంలో వచ్చే స్వాతీ నక్షత్రం రోజున శ్రీ నరసింహ స్వామి వారికీ ఉంజల్ సేవ జరుగుతుంది. ఉంజల్ సేవ కై ఈ మధ్య ఆలయంలో ఒక ప్రెత్యేక మండపం నిర్మించబడినది. నరసింహ స్వామి జన్మ తిది అయిన స్వాతీ నక్షత్రం రోజున స్వామివారి ఉత్సవ విగ్రహాలకు వైభవోపేతముగా ఉంజల్ సేవ జరుగుతుంది.
.jpg)


4 comments:
Very well and informative!..
Jaideep
All the best!
Nice info...
బ్లాగు చాలా బాగుంది. మంచి సమాచారం పెడుతున్నారు. :)
చక్కని బ్లాగు.. మరిన్ని రాయగలరు స్వామి వారి గురించి
Post a Comment